ముగిసిన జిల్లా స్థాయి చెస్‌ పోటీలు | Sakshi
Sakshi News home page

ముగిసిన జిల్లా స్థాయి చెస్‌ పోటీలు

Published Mon, Apr 8 2024 1:50 AM

చెస్‌ టోర్నీ విజేతలకు                                     బహుమతులు అందజేసిన దృశ్యం  - Sakshi

విజయవాడస్పోర్ట్స్‌: కృష్ణా జిల్లా అండర్‌–17 బాలబాలికల చదరంగం పోటీలు పోరంకిలోని గ్రీన్‌ స్కూల్‌లో ఆదివారం జరిగాయి. జిల్లాలోని 53 మంది క్రీడాకారులు పోటీలకు ప్రాతినిధ్యం వహించినట్లు కృష్ణా జిల్లా చెస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఎన్‌.ఎం.ఫణికుమార్‌ తెలిపారు. బాలుర విభాగంలో కె.సందీప్‌, ఎం.జితేష్‌నాగ్‌, బాలికల విభాగంలో ఎస్‌.జాయ్‌ప్రశస్త, ఎస్‌.జోష్లిన్‌ ప్రశస్త విజేతలుగా నిలిచినట్లు చెప్పారు. అండర్‌–7,9,11,13,15 పోటీల్లో సుహిరిత్‌, నాగవెంకటపుష్కల్‌, శ్రేయస్‌, వర్షిత్‌, దర్ష్‌, సుహాస్‌, హర్షిత్‌సాయి, సాయిసాత్విక్‌, ప్రవీణ్‌, రోహన్‌, దివిషచౌదరి, జోష్నిక, శ్యామ్‌, యశస్వి, నాగమహిశ్రీ, గీతిక, లాస్య, కావ్యశ్రీ, స్వాతి విజేతలుగా నిలిచినట్లు తెలిపారు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌ జె.సాయిఅపర్ణ, ఎస్‌ఆర్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ పి.రేణుక, చెస్‌ కోచింగ్‌ అకాడమి అధ్యక్షులు జె.సౌజన్య బహుమతులు అందజేశారు.

Advertisement
Advertisement