అర్చకులకు ఉగాది పురస్కారాలు | Sakshi
Sakshi News home page

అర్చకులకు ఉగాది పురస్కారాలు

Published Wed, Mar 22 2023 2:30 AM

-

కర్నూలు కల్చరల్‌: దేవదాయశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ సేవలు అందించే పండితులు, అర్చకులకు ప్రతి సంవత్సరం ఉగాది పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ ఏడాది ఈ పురస్కారాలకు ముగ్గురు అర్చకులను ఎంపిక చేసినట్లు దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆదిశేషు నాయుడు తెలిపారు. ఉగాది పర్వదినం రోజున వీరిని జిల్లా కలెక్టర్‌ సన్మానించి పురస్కారంతో పాటు రూ.10 వేలు ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. కర్నూలు పేట ఆంజనేయ స్వామి ఆలయ అర్చకుడు జంగం శివలింగయ్య, గోనెగండ్ల మండలం వెంగోడు చెన్నకేశవ స్వామి ఆలయ అర్చకుడు పూజరి సత్యనారాయణ స్వామి, పెద్దకడుబూరు మండలం తారాపురం గ్రామం గిడ్డాంజనేయ స్వామి ఆలయ అర్చకుడు టి.నాగరాజు ఉగాది పురస్కారాలకు ఎంపికైన వారిలో ఉన్నారు.

Advertisement
Advertisement