సెలవురోజు పన్ను వసూలు రూ.36 లక్షలు | Sakshi
Sakshi News home page

సెలవురోజు పన్ను వసూలు రూ.36 లక్షలు

Published Mon, Mar 27 2023 1:42 AM

-

కర్నూలు (టౌన్‌): నగరపాలక సంస్థ పరిధిలో 2022–2023 ఆర్థిక సంవత్సరం మరో 5 రోజుల వ్యవధిలో ముగుస్తుంది. దీంతో పన్నుదారుల కోసం నగరపాలక సంస్థ అధికారులు సెలవురోజు ఆదివారం పన్ను కౌంటర్లు తెరవడంతో ప్రజలు ఆస్తిపన్ను, నీటి పన్నులు చెల్లించారు. ఆస్తిపన్ను రూ.34,13,802, నీటి పన్ను రూ.2,64,579లు కలిపి మొత్తం రూ.36,78,381లు వసూలు అయ్యినట్లు నగరపాలక మేనేజర్‌ చిన్నరాముడు వెల్లడించారు. ఎండలు ఉండటంతో పన్నుదారుల కోసం కౌంటర్ల వద్ద మంచినీటి సౌకర్యం, షామియానులు ఏర్పాటు చేశామన్నారు.

Advertisement
Advertisement