కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే విస్తృతంగా కొనసాగుతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సర్వే ఈ నెల 29వ తేదీ వరకు సాగుతుంది. ఇందులో భాగంగా ఆయా సచివాలయాల పరిధిలోని వలంటీర్లు, ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకుంటున్నారు. ఎవరికై నా అనారోగ్యం ఉంటే వారి వివరాలు సేకరించి యాప్లో నమోదు చేస్తున్నారు. ఇలాంటి వారికి జగనన్న ఆరోగ్య సురక్ష టోకెన్ అందజేస్తున్నారు. ఈ టోకెన్ తీసుకుని ఈ నెల 30వ తేదీ నుంచి జరిగే వైద్యశిబిరాల్లో పాల్గొని చికిత్స చేయించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. వైద్యశిబిరంలో అవసరమైన వారికి వైద్యపరీక్షలు నిర్వహించి, స్పెషలిస్టు వైద్యులచే చికిత్స చేసి మందులు అందజేస్తారని చెబుతున్నారు. ఈ వైద్యుల పరిధిలోకి రాని వ్యాధులు ఏవైనా ఉంటే అలాంటి వారిని గుర్తించి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రెఫర్ చేస్తారని సూచిస్తున్నారు. ఈ మేరకు సర్వే జరుగుతున్న తీరును జిల్లా ప్రొగ్రామ్ అధికారులు మంగళవారం పర్యవేక్షించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వై. ప్రవీణ్కుమార్ గార్గేయపురం గ్రామంలో కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు, ఆశాలకు తగు సూచనలు అందజేశారు. ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. వైద్యశిబిరంలో ఏడురకాల పరీక్షలు(బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, మలేరియా, డెంగీ, యూరిన్, గళ్ల పరీక్ష) నిర్వహిస్తారని, వాటి ఫలితాల ఆధారంగా మందులు అందజేస్తారన్నారు. అలాగే నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని దిన్నెదేవరపాడు గ్రామంలో రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం జిల్లా కో ఆర్డినేటర్ హేమలత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె గ్రామ ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష టోకెన్లను పంపిణీ చేశారు. ఈ టోకెన్లను తీసుకుని వైద్యశిబిరానికి వస్తే వైద్యపరీక్షలు నిర్వహించి నిపుణులైన వైద్యులచే చికిత్స అందించి మందులు అందజేస్తారని ఆమె సూచించారు.
విస్తృతంగా జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే
Published Wed, Sep 20 2023 2:20 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement