వివాహిత ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Published Thu, Nov 9 2023 1:12 AM

-

కొత్తపల్లి: సంతానం కలగలేదనే మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కపిలేశ్వరం గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లా మానపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెంది న రామేశ్వరి(23), కపిలేశ్వరం గ్రామానికి చెందిన రామాంజనేయులు ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏళ్లు గడిచినా సంతానం కలగకపోవడంతో మనోవేదనకు గురై రావే శ్వరి ఈనెల 6న ఇంట్లో పురుగు మందు తాగింది. కర్నూలులో ఆసుపత్రికి తరలించగా అక్కడ కోలుకోలేక మంగళవారం రాత్రి మృతిచెందింది. కేసు నమోదు చేసినట్లు ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement