నంద్యాల: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలన పూర్తయిందని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ పేర్కొన్నారు. బుధవారం నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఈవీఎంల భద్రత గోడౌన్లో జరుగుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ప్రథమ స్థాయి పరిశీలన (ఎఫ్ఎల్సీ) చివరి ఘట్టాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్లకు సంబంధించి ఎఫ్ఎల్సీ కార్యక్రమాన్ని బెల్ ఇంజినీర్లు, రెవెన్యూ, ఇతర సిబ్బంది నిర్వహించారన్నారు. ఇందులో పార్లమెంట్కు సంబంధించి 2030 కంట్రోల్ యూనిట్లు, 2509 బ్యాలెట్ యూనిట్లు, 2452 వీవీ ప్యాట్లు మొదటి దఫా పరిశీలన పూర్తిచేసుకుని ఓటింగ్ ప్రక్రియకు సిద్ధంగా ఉన్నాయన్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 1,924 కంట్రోల్ యూనిట్లు, 2,520 బ్యాలెట్ యూనిట్లు, 2,451 వీవీ ప్యాట్లు మొదటి దఫా పరిశీలన పూర్తిచేసుకుని ఓటింగ్ ప్రక్రియకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్కు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా హాజరయారన్నారు. గత నెల 16వ తేదీ ప్రారంభమైన ఈవీఎంల మొదటి దఫా పరిశీలన ఘట్టం బుధవారంతో ముగిసిందన్నారు. గోడౌన్లో భద్రపరిచిన ఈవీఎంల నిఘా నిమిత్తం సెక్యూరిటీ గార్డ్స్ కోసం నిర్మిస్తున్న షెల్టర్ను పరిశీలించారు. ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెక్ విజయవంతంగా పూర్తి చేసినందుకు 14 మంది బెల్ ఇంజినీర్లను, నోడల్ అధికారి, ఎఫ్ఎల్సీ సూపర్వైజర్ సుబ్బారెడ్డిని కలెక్టర్ సన్మానించారు.
ఈవీఎంల ప్రథమ స్థాయి పరిశీలన పూర్తి
Published Thu, Nov 9 2023 1:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement