అడవుల సంరక్షణ అందరి బాధ్యత | Sakshi
Sakshi News home page

అడవుల సంరక్షణ అందరి బాధ్యత

Published Fri, Nov 17 2023 1:50 AM

సమీక్ష నిర్వహిస్తున్న చీఫ్‌ కన్జర్వేటర్‌ రామకృష్ణ  
 - Sakshi

కర్నూలు కల్చరల్‌: అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని అటవీ శాఖ కర్నూలు సర్కిల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ పి.రామకృష్ణ అన్నారు. గురువారం ఆయన కర్నూలు సర్కిల్‌ అటవీ శాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవులు, అటవీ ప్రాంత ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలప అక్రమ రవాణాను నిరోధించాలన్నారు. సీఏఎమ్‌పీఏ స్కీం అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలన్నారు. నిర్దేశించిన గడువులోగా ప్లాంటేషన్‌ పూర్తి చేయాలన్నారు. కర్నూలు ఇన్‌ఛార్జి డీఎఫ్‌ఓ నాగార్జునరెడ్డి, వైఎస్సార్‌ కడప డీఎఫ్‌ఓ సందీప్‌రెడ్డి, రెడ్‌ శాండల్‌ స్క్వాడ్‌ డీఎఫ్‌ఓ గురుప్రభాకర్‌రెడ్డి, నంద్యాల సోషల్‌ ఫారెస్ట్‌ డీఎఫ్‌ఓ వెంకటేశ్వరరావు, ప్రొద్దుటూరు సబ్‌ డీఎఫ్‌ఓ దివాకర్‌, ఎఫ్‌ఆర్‌వోలు, డీఆర్‌వోలు సమీక్షలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement