Sakshi News home page

ఎంతో మేలు చేశారు

Published Sun, Nov 19 2023 1:52 AM

- - Sakshi

మా గ్రామంలో బడి సరిగా ఉండేది కాదు. పిల్లలు హాలహర్వి, గూళ్యం గ్రామాలకు వెళ్లేవారు. జగనన్న సీఎం అయిన తర్వాత మా గ్రామంలోని ఎంపీపీ పాఠశాలను నాడు–నేడు కింద అభివృద్ధి చేశారు. నా కొడుకు గాదిలింగప్ప ఇదే స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. పుస్తకాలు, బ్యాగు, షూస్‌ అన్నీ ఇచితంగా ఇచ్చారు. అమ్మఒడి డబ్బులు అందించారు. నా కొడుకు బాగా చదువుతున్నాడు. జగనన్న మాలాంటి పేదలకు ఎంతో మేలు చేశారు. ఆయన చేసిన మేలును మరచిపోలేం.

– శ్రీనివాసులు, సిద్ధాపురం, హాలహర్వి మండలం

Advertisement
Advertisement