శ్రీశైలం: క్షేత్ర పరిధిలో దేవస్థానం నిర్వహిస్తున్న ఓ వసతి సముదాయంలో హైదరాబాద్కు చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. దేవస్థానం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆత్మహత్య విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ ప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాదుకు చెందిన మల్లేష్ (35), సరిత (28) ఈనెల 13వ తేదీన శ్రీశైలం చేరుకుని స్థానిక ఓ వసతి సముదాయంలో గది అద్దెకు తీసుకున్నారు.
వారు ఇచ్చిన వివరాల మేరకు ఈనెల 15న ఖాళీ చేయాల్సి ఉండగా 17వ తేదీ ఉదయం వరకు వారి సమాచారం లేదు. అయినా అక్కడి సిబ్బంది పట్టించుకోలేదు. పక్క గదిలో బస చేసిన యాత్రికులకు దుర్వాసన వస్తుండటంతో ఫిర్యాదు చేయడంతో అందులో ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. పోలీసులు గదిని పరిశీలించి ఆధారాలు సేకరించారు.
మృతురాలి సరిత దగ్గర లభించిన ఆధార్కార్డు, ఫోన్ నంబర్ల ఆధారంగా ఆ చూకీ గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాదు సరూర్ నగర్కు చెందిన సరిత, శంకర్ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. కాగా శంకర్ స్నేహితుడైన కార్పెంటర్ మల్లేష్తో సరితకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఏమి జరిగిందో తెలియదు కానీ ఇద్దరూ శ్రీశైలం వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాదులో మీర్పేట పోలీస్స్టేషన్లో సరిత మిస్సింగ్ కేసు నమోదు అవ్వడంతో అక్కడి పోలీసులు శనివారం సాయంత్రం శ్రీశైలం చేరుకున్నారు.