మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 6 2023 1:00 AM

-

మరిపెడ: మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని మున్సిపల్‌ చైర్మన్‌ గుగులోతు సింధూరరవికుమార్‌ అన్నారు. మరిపెడలో ఆమె మాట్లాడుతూ.. దినదినాభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీలో రోడ్ల విస్తరణ తప్పనిసరి అన్నారు. పెరుగుతున్న రద్దీ కారణంగా రోడ్ల వెడల్పు ప్రజల అభిష్టం మేరకే చేస్తున్నామన్నారు. వ్యాపారులు ఇది గమనించాలని ఆమె కోరారు. మేజర్‌ గ్రామపంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్పు చెందిన మరిపెడ మరింత మెరుగులు దిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌లో రహదారుల విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎరుర్కోకుండా ముందస్తుగా పక్కా ప్రణాళిక ప్రకారం టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

Advertisement
Advertisement