వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

Published Sun, Apr 23 2023 2:10 AM

లచ్చు (ఫైల్‌)  - Sakshi

ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాలో వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం ఇద్దరు మృతి చెందారు.

నర్సింహులపేట: మండలంలోని పెద్దనాగారం పరిధి గోపతండా సమీపంలో వరంగల్‌–ఖమ్మం హైవేపై శుక్రవారం అర్ధరాత్రి డీసీఎంను ద్విచక్రవాహనదారుడు ఢీకొన్న ఘటనలో వాంకుడోత్‌ తండాకు చెందిన వాంకుడోత్‌ లచ్చు(45) మృతి చెందాడు. ఎస్సై మంగీలాల్‌ కథనం ప్రకారం..మరిపెడకు పనుల నిమిత్తం వెళ్లిన లచ్చు తిరిగి బైక్‌పై ఇంటికి వస్తున్న క్రమంలో గోపతండా సమీపంలో ఆగి ఉన్న డీసీఎంను ఢీకొన్నాడు. తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నర్సంపేట రూరల్‌ : హీరోహోండా స్కూటీని, ట్రాలీ ఆటో ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పట్టణ శివారులోని కాకతీయనగర్‌ సమీపంలో శనివారం చోటుచేసుకుందని ఎస్సై రవీందర్‌ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం ఏపూర్‌కు చెందిన వాంకుడోతు అచ్చి(42) తన కుమారుడు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రిలో చూపించేందుకు నర్సంపేటకు తీసుకొచ్చారు. అయితే డబ్బులు సరిపోకపోవడంతో వారి బంధువుల ఇళ్లయిన చెన్నారావుపేట మండలం వైపు స్కూటీపై వెళ్తోంది. అదే సమయంలో చెన్నారావుపేట మండలానికి చెందిన ట్రాలీ ఆటో నర్సంపేటవైపు వస్తుంది. నర్సంపేట పట్టణంలోని కాకతీయనగర్‌ సమీపంలోని బిలివర్స్‌ చర్చి వద్ద నర్సంపేట –నెక్కొండ ప్రధాన రహదారిపై రెండు వాహనాలు ఢీకొనడంతో స్కూటీపై ఉన్న అచ్చి అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించారు. మృతురాలికి భార్య, కుమారుడు ఉన్నారు.

అచ్చి (ఫైల్‌)
1/1

అచ్చి (ఫైల్‌)

Advertisement

తప్పక చదవండి

Advertisement