● రూ.80 వేల విలువ చేసే 19 ఎల్వీ కాయిల్స్ మాయం
పరకాల : పరకాల సబ్స్టేషన్ ఆవరణలోని ట్రాన్స్ఫార్మర్ షెడ్డులో ఆది వారం రాత్రి దొంగలుపడ్డారు. విధులు ముగించుకొని వెళ్లిన సిబ్బంది సోమవారం ఉదయం 8 గంటలకు ట్రాన్స్ఫార్మర్ షెడ్డు తెరువగా రూ. 82 విలువ చేసే 19ఎల్వీ కాయిల్స్ దొంగతనం జరిగినట్లు గుర్తించి షెడ్డు సబ్కాంట్రాక్టర్ భూరెడ్డి మధుసూదన్రెడ్డికి సమాచారం అందజేశారు. గుర్తుతెలియని వ్యక్తులు కిటికి నుంచి షెడ్డులోకి ప్రవేశించి చోరీకి పాల్పడగా మధుసూదన్రెడ్డి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.