ఐలమ్మ స్ఫూర్తితో కేసీఆర్‌ పాలన | Sakshi
Sakshi News home page

ఐలమ్మ స్ఫూర్తితో కేసీఆర్‌ పాలన

Published Mon, Sep 11 2023 1:28 AM

ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు - Sakshi

పాలకుర్తి టౌన్‌ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ పాలన కొనసాగిస్తున్నారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్‌ తెలంగాణ సాధించారన్నారు. ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్‌ ప్రకటించడం అభినందనీయన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర మరువలేనిదని, ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యం రగిలించిన ధీరశాలి ఐలమ్మ అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్‌రావు, సర్పంచ్‌ వీరమానేని యాకాంతారావు పాల్గొన్నారు.

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి

ఎర్రబెల్లి దయాకర్‌రావు

Advertisement
Advertisement