● డీఈఓ పి.రామారావు
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పి. రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించగా జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు హాజరై మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్ విజయాన్ని రూపొందించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రతీ మూడు నెలలకోసారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం తల్లిదండ్రులకు పలు క్రీడలను నిర్వహించి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ ఆజాద్, హెచ్ఎం ఆరుద్ర వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయురాలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.