సినిమాల్లో అవకాశాలు రాలేదని.. | Sakshi
Sakshi News home page

సినిమాల్లో అవకాశాలు రాలేదని..

Published Mon, Oct 30 2023 1:24 AM

- - Sakshi

సాక్షి, వరంగల్‌: సినిమాల్లో సరైన పాత్రలు లభించడం లేదనే కారణంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు.. వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. కాజీపేట సీఐ సార్ల రాజు కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా మార్తాండ నగర్‌ గ్రామానికి చెందిన పిల్లి సాయి ప్రకాశ్‌(26) పలు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించాడు. అయితే ఇప్పటి వరకూ సరైన అవకాశాలు దక్కలేదు.

ఈ క్రమంలో 20 రోజుల క్రితం భద్రాచలం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే భద్రాచలం వెళ్లకుండా హనుమకొండ జిల్లా కేంద్రానికి చేరుకుని హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో జీవితంలో స్థిరపడే అవకాశం రాలేదనే మనస్తపంతో ఈ నెల 28న వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు సీఐ రాజు వివరించారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చదవండి: కలెక్టరేట్‌ ఉద్యోగి.. అలా అవ్వడానికి అసలు కారణాలేంటి?

Advertisement

తప్పక చదవండి

Advertisement