● విద్యార్థిని ఆత్మహత్య
హసన్పర్తి: పెళ్లి చేసుకోవడం ఇ ష్టం లేక ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హసన్పర్తి మండల కేంద్రంలో జరిగింది. సీఐ గోపీ కథ నం ప్రకారం హసన్పర్తికి చెందిన బిగుళ్ల అశోక్ కూతురు వర్ష (21) నగరంలోని చైతన్య కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది.అయితే తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఇప్పుడే తనకు పెళ్లి వద్దని నిరాకరించింది. ఈ క్రమంలో బుధవారం తల్లిదండ్రులు బయటకు వెళ్లగా వర్ష ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన చుట్టుపక్కల వారు వర్షను చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించగా చికిత్సపొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందింది. కాగా, పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మానసిక వేదనకు గురై వర్ష ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి గురువారం ఫిర్యాదు చేశారని సీఐ తెలిపారు.