విద్యారణ్యపురి: కాళోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న కాళోజీ సోదరుల యాది సభను నిర్వహించనున్నట్లు కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, కార్యదర్శి వీఆర్ విద్యార్థి శనివారం తెలి పారు. హనుమకొండలోని ఇండియన్ రెడ్ క్రాస్ హా ల్లో నిర్వహించే ఈసభలో ప్రజాకవి కాళోజీ నారా యణరావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజితకు, షాద్ కాళోజీ రామేశ్వర్రావు స్మారక పురస్కారాన్ని ప్రముఖ ఉర్దూకవి మసూద్ మిల్లా మహాషర్కు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సభలో వక్తలుగా కేంద్ర సాహిత్య అ కాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, ప్రముఖ కవి, రచయిత్రి నెల్లుట్ల రమాదేవి, ప్రము ఖ కవి డాక్టర్ ఎన్వీఎన్చారి, కాళోజీ ఫౌండేషన్ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్రావు, కార్యనిర్వాహక కార్యదర్శి రాజ్కుమార్, బాధ్యులు పందిళ్ల అశోక్కుమార్, పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. స్మారక పురస్కారాల గ్రహీతల పరిచయాన్ని డాక్టర్ కె.రామలక్ష్మి, ఎండీ సిరాజుద్దీన్ చేస్తారని తెలిపారు.