అవినీతి పాలకులను ఇంటికి పంపించాలి | Sakshi
Sakshi News home page

అవినీతి పాలకులను ఇంటికి పంపించాలి

Published Sat, Nov 18 2023 1:36 AM

తొర్రూరులో మాట్లాడుతున్న ఆకునూరి మురళి  - Sakshi

తొర్రూరు/పెద్దవంగర: వచ్చే ఎన్నికల్లో అవినీతి పాలకులను ఇంటికి పంపించాలని జాగో తెలంగాణ వేదిక కన్వీనర్‌, మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి అన్నారు. శుక్రవారం పెద్దవంగర, తొర్రూరు డివిజన్‌ కేంద్రంలో ఆయన చేపట్టిన తెలంగాణ ఓటర్ల చైతన్య ప్రచార యాత్రకు ఘన స్వాగతం ఫలికారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న వనరులను పూర్తిగా వినియోగించడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. రాష్ట్రంలో ఉన్న 40 లక్షల నిరుద్యోలను విస్మరించి ఏకపక్ష పాలన సాగించారని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వానికి అన్నివర్గాల ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో జాగో తెలంగాణ యాత్ర సమన్వయకర్త నైనాల గోవర్ధన్‌, కొత్తపల్లి రవి, పద్మజా, శంకర్‌, స్వరూప, వీరన్న, కల్పన, గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement