డయల్‌ యువర్‌ డీఎంకు స్పందన | Sakshi
Sakshi News home page

డయల్‌ యువర్‌ డీఎంకు స్పందన

Published Sat, Nov 18 2023 1:36 AM

-

నెహ్రూసెంటర్‌: ఆర్టీసీ మహబూబాబాద్‌ డిపో ఆధ్వర్యంలో నిర్వహించిన డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమానికి ప్రజలు, ప్రయాణికుల నుంచి విశేష స్పందన వచ్చిందని, సలహాలు, సూచనలు అందజేశారని డీఎం ఎం.శివప్రసాద్‌ శుక్రవారం అన్నారు. మానుకోట మండలంలోని మల్యాల గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని, కేసముద్రం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులను ఐదు నిమిషాల పాటు నిలపాలని కోరినట్లు తెలిపారు. గూడూరు మండలంలోని కొల్లాపురం గ్రామానికి, గోవిందాపురం, అప్పరాజుపల్లి వయా జగ్గుతండా మీదుగా బస్సు నడపాలని ప్రయాణికులు కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఎం ఎం.శివప్రసాద్‌ మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ సర్వీసులను పెంచుతామన్నారు.

Advertisement
Advertisement