దోపిడీ పాలకులను ఓడించాలి | Sakshi
Sakshi News home page

దోపిడీ పాలకులను ఓడించాలి

Published Mon, Nov 20 2023 1:08 AM

సమావేశంలో మాట్లాడుతున్న 
ప్రొఫెసర్‌ వెంకట్‌నారాయణ - Sakshi

మహబూబాబాద్‌ అర్బన్‌: దోపిడీ పాలకవర్గాన్ని ఓడించడానికి తెలంగాణ మేధావులంతా ఒకటై గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేస్తున్నామని తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కమిటీ చైర్మన్‌, సామాజికవేత్త, ప్రొఫెసర్‌ కూరపాటి వెంకట్‌ నారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణను చేసిందన్నారు. ప్రజాప్రతినిధులు పేద రైతులు, ప్రభుత్వ భూములను అవినీతి అధికారుల అండదండలతో ధరణి మాటున సొంతం చేసుకున్నారని ఆరోపించారు. వరంగల్‌, కరీంనగర్‌, హైదరాబాద్‌ ఇతర జిల్లాల్లో విలువైన భూములను లాక్కురన్నారు. బొగ్గు గనులు, ఇసుక, గ్రానైట్‌ క్వారీలను సొంతం చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మూసివేతకు దిగజార్చి పార్టీ నాయకులకు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలను అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించలేదని, నిరుద్యోగులను నిండా ముంచిందన్నారు. సమావేశంలో డాక్టర్‌ డోలి సత్యనారాయణ, నాయకులు మైస శ్రీనివాసులు, ఆరుద్ర పరమాత్మచారి, ఖాజా పాషా, కృష్ణప్రసాద్‌, మానుకోట ఉద్యమ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement