మహబూబాబాద్: ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఎన్నికల పోలింగ్ప్రక్రియ, తదితర విషయాలపై జిల్లా కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల ఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా వికాస్రాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణతో ముడిపడిన వివిధ అంశాలకు సంబంధించిన నివేదికలను అందజేయడంలో ఆలస్యం చేయవద్దన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. జిల్లాలోని డోర్నకల్, మానుకోట నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు రాలేని 997మంది దివ్యాంగులు, వయోవృద్ధులకు 12డీ ఫాం ద్వారా హోం ఓటింగ్కు అవకాశం కల్పించామన్నారు. ఈనెల 23,24 తేదీల్లో హోం ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ డేవిడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్