విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి | Sakshi
Sakshi News home page

విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి

Published Wed, Nov 22 2023 1:40 AM

-

మరిపెడ: పోలింగ్‌ విధులను పూర్తి అవగాహనతో సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక అన్నారు. మంగళవారం మరిపెడలోని మోడల్‌ జూనియర్‌ కళాశాలలో ఎన్నికల అధికారులకు నిర్వహించిన రెండో విడత శిక్షణ తరగతులను అబ్జర్వర్‌ ఇరా సింఘాల్‌తో కలిసి కలెక్టర్‌ శశాంక సందర్శించారు. శిక్షణ పొందుతున్న ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులతో మాట్లాడి వారి అనుమాలను నివృత్తి చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. పోలింగ్‌ విధుల్లో ఎలాంటి పొరపాట్లు చేయొద్దని సూచించారు. అవగాహనతో పోలింగ్‌ విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డోర్నకల్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి నరసింహారావు, సీపీఓ సుబ్బారావు, డీఈఓ రామారావు, సూర్యనారాయణ, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక

Advertisement
Advertisement