Sakshi News home page

తరలిన ఈవీఎంలు, వీవీ ప్యాట్లు

Published Thu, Nov 30 2023 12:48 AM

ఏనుమాములలో పోలింగ్‌ సామగ్రిని పరిశీలిస్తున్న ఎన్నికల సిబ్బంది  - Sakshi

వరంగల్‌: వరంగల్‌ ఏనుమాములలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వరంగల్‌ పశ్చిమ, తూర్పు, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల ఈవీఎంల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్‌ఓలు పరిశీలించారు. ఈసందర్భంగా హనుమకొండ కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ మాట్లాడుతూ.. హనుమకొండ జిల్లాలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌, తూర్పు ఆర్‌ఓ రిజ్వాన్‌బాషా డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల్లో ఈవీఎంలు ఇతర పోలింగ్‌ సామగ్రి పంపిణీని పరిశీలించారు. పోలింగ్‌ విధులకు హాజరైన అధికారులు, సిబ్బంది హాజరు వివరాల్ని జనరల్‌ అబ్జర్వర్లు డాక్టర్‌ హెచ్‌.ఎన్‌.గోపాలకృష్ణ, షణ్మఘరాజన్‌, పోలీస్‌ అబ్జర్వర్‌ తోగో ఖర్గా.. కలెక్టర్‌ను అ డిగి తెలుసుకున్నారు. పోలింగ్‌ అధికారులు సిబ్బందితో మాట్లాడి ఈవీఎంల డెమోను పరిశీలించారు. ఏనుమాములలోని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల వద్ద వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వై ద్య సేవలను పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వ ద్ద భద్రతా ఏర్పాట్లపై పోలీస్‌ అధికారులు సిబ్బందికి సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఎంఏ బారీ పలు సూచనలు చేశారు. జిల్లా జనరల్‌ అబ్జర్వర్లు, కలెక్టర్‌ జెండా ఊపి పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలు ఎన్నికల సామగ్రితో వెళ్తున్న వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మహేందర్‌ జీ, ట్రెయినీ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా, రిటర్నింగ్‌ అధికారులు రిజ్వాన్‌బాషా, రమేశ్‌, శ్రీనివాస్‌, వరంగల్‌ తహసీల్దార్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ తదితరులున్నారు.

adsolute_video_ad

Advertisement

What’s your opinion

Advertisement