అచ్చంపేట రూరల్: అమ్రాబాద్ మండలం మన్ననూర్ బాలికల గురుకుల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థిని నిఖితది ముమ్మాటికీ హత్యనేనని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మరాజు, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, మోపతయ్య అన్నారు. శనివారం అచ్చంపేట మండలంలోని హాజీపూర్ చౌరస్తా శ్రీశైలం– హైదరాబాద్ హైవేపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని, నిఖిత మృతికి కారకులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిఖిత చనిపోయి నెలరోజులు గడుస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దళిత అమ్మాయి కుటుంబానికి న్యాయం చేయలేని ప్రజాప్రతినిధులు ఉన్నా.. లేకున్నా ఒకటే అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. త్వరలో నిర్వహించే అచ్చంపేట దిగ్భంధంను జయప్రదం చేయాలని కోరారు. కాగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రహదారిపై వాహనాలు నిలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనాలను దారి మళ్లించి వివిధ రూట్లలో పంపించారు. కార్యక్రమంలో నాయకులు కాశీం, శ్రీనివాసులు, వెంకటేష్, నాసరయ్య, అంబయ్య, అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.
నిఖిత కుటుంబానికి న్యాయం చేయాలి
Published Sun, Apr 9 2023 1:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆయిల్పాం రైతులు జాగ్రత్తలు పాటించాలి
4వేల బస్తాల జొన్నల కొనుగోలు
శత్రువంచన చేరి దెబ్బతీయాలని చూస్తున్నారు..
ఎన్నికల్లో పోలీస్ విధులే కీలకం
ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రం పరిశీలన
రాజీ అయ్యే కేసులు గుర్తించాలి
పాలమూరుకు ఎంత చేసినా తక్కువే..
శత్రువంచన చేరి దెబ్బతీయాలని చూస్తున్నారు..
గాంధీ కుటుంబంపై సన్నగిల్లుతున్న విశ్వాసం
ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ ఫలాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement