శబరిమలకు ఆర్టీసీ అద్దె బస్సులు: ఆర్‌ఎం | Sakshi
Sakshi News home page

శబరిమలకు ఆర్టీసీ అద్దె బస్సులు: ఆర్‌ఎం

Published Sat, Nov 4 2023 1:34 AM

- - Sakshi

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శబరిమలకు ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన సూపర్‌బస్సులు నడుపనున్నట్లు రీజినల్‌ మేనేజర్‌ వి.శ్రీదేవి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం విలేజ్‌ బస్సు అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిపోల వారీగా వీబీఓల పనితీరును అడిగి తెలుసుకున్నారు. శబరిమల, పంచారామాలు, కార్తీకమాసం, అరుణాచాలం వంటి క్షేత్రాలకు భక్తులు దర్శించుకోవడానికి ఆర్టీసీ బస్సును ఎలా బుక్‌ చేసుకోవాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ సురక్షితులైన డ్రైవర్లతో శబరిమలైకు బస్సులు నడపడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బస్సులో టీవీ సౌకర్యం ఉంటుందని, ఇద్దరు మణికంఠస్వాములు, ఇద్దరు వంట మనుషులు, సామాన్లు సర్దేందుకు ఒక వ్యక్తి ఉచితంగా (సీటు లేకుండా) ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. బస్సును అద్దెకు బుక్‌ చేసిన గురుస్వామికి ఉచిత ప్రయాణం ఉంటుందని, ఒకటి కంటే ఎక్కువ బస్సులు బుక్‌ చేస్తే ఆ బస్సులపై రోజుకు రూ.300 చొప్పున కమిషన్‌ అందజేస్తామని తెలిపారు. బస్సులు కావాల్సిన వారు సమీపంలోని డిపో మేనేజర్లను సంప్రదించాలని ఆమె కోరారు. సమావేశంలో డిప్యూటీ ఆర్‌ఎం శ్యామల, డీఎం సుజాత, సీఐ మోసీన్‌బాను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement