హేమాహేమీలతో ప్రచారం.. | Sakshi
Sakshi News home page

హేమాహేమీలతో ప్రచారం..

Published Fri, Nov 17 2023 1:18 AM

- - Sakshi

కాంగి‘రేసు’..: ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ అగ్రనేతలు రంగంలోకి దిగారు. ఇప్పటికే కొల్లాపూర్‌ సభతో పాటు కల్వకుర్తి, జడ్చర్ల కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. కొడంగల్‌, మక్తల్‌, గద్వాల, అలంపూర్‌లో నిర్వహించిన సభలకు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. త్వరలో కాంగ్రెస్‌కు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తదితర నేతలు ఉమ్మడి జిల్లాలో పర్యటించేలా సన్నాహాలు చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌లో జోష్‌: ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించక ముందు నుంచే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలతో ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు దేవరకద్ర, కొడంగల్‌లో పర్యటించారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో జడ్చర్ల, అచ్చంపేట, వనపర్తి, దేవరకద్ర, మక్తల్‌, గద్వాల, నారాయణపేట సభల్లో పాల్గొన్నారు. తాజాగా ఈ నెల 19న, 22న మళ్లీ రానుండగా.. ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది.

హేమాహేమీలతో ప్రచారం..

19న పేటకు నడ్డా..

Advertisement
Advertisement