కొత్తపల్లిలో చిరుత కలకలం | Sakshi
Sakshi News home page

కొత్తపల్లిలో చిరుత కలకలం

Published Sat, Nov 18 2023 1:24 AM

వాగులోని పొదల్లో నిద్రిస్తున్న చిరుత  - Sakshi

కోస్గి: మండలంలోని కొత్తపల్లిలో చిరుత కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం గ్రామ శివారులోని వాగులో ఉన్న పొదల్లో చిరుతను గమనించిన రైతులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు తెలపడంతో అధికారులు వచ్చి పరిశీలించారు. చీకటిగా ఉండటంతోపాటు మేకను తిని మత్తులో ఉన్న చిరుతను నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు శనివారం ఉదయం అక్కడే ఉంటే పట్టుకుంటామని, అప్పటి వరకు గ్రామస్తులు ఆ ప్రాంతం వద్దకు వెళ్లకూడదని చెప్పి వెళ్లిపోయారు. కాగా చీకటిగా ఉండటంతోపాటు ముళ్ల పొదల్లో మత్తుగా ఉన్న చిరుతను పట్టుకోవడం సాధ్యం కాలేదని, ఉదయం అక్కడే ఉంటే చిరుతను బంధిస్తామని అటవీ శాఖ డిస్టిక్‌ రేంజ్‌ ఆఫీసర్‌ నారాయణరావు తెలిపారు.

మేకను తిని వాగులోని పొదల్లో దాగిన చిరుత

పరిశీలించిన అటవీశాఖ అధికారులు

Advertisement
Advertisement