రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్మరణం | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్మరణం

Published Thu, Nov 23 2023 1:00 AM

బాలరాజు (ఫైల్‌)  - Sakshi

కొత్తకోట రూరల్‌: గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్‌ మృతిచెందిన ఘటన మండలంలోని విలియంకొండ సమీపంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి కథనం మేరకు.. వనపర్తి మండలం శ్రీనివాసాపురం గ్రామానికి చెందిన బాలరాజు (35) పెద్దమందడి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తుండేవాడు. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని అత్తగారి ఊరైన పెబ్బేరుకు బైక్‌పై వెళ్తుండగా విలియంకొండ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బాలరాజుకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement
Advertisement