అలంపూర్ రూరల్: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. కార్తీకమాసం శుక్రవారం కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో ఆలయాలు కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు ఆలయాల ప్రాంగణంలో దీపాలు వెలిగించారు.
ఆలయాలను దర్శించుకున్న
గద్వాల జెడ్పీ చైర్పర్సన్..
అలంపూర్ ఆలయాలను గద్వాల జెడ్పీ చైర్పర్సన్, గద్వాల కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరిత శుక్రవారం దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.