బల్మూర్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు అస్వస్థతకు గురి కాగా.. ఓ డాక్టర్ సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. గురువారం అచ్చంపేట నుంచి నాగర్కర్నూల్కు బయల్దేరిన ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు ఎక్కాడు. బల్మూర్ మండలం మహదేవ్పూర్ స్టేజీ సమీపంలో అతడు తీవ్ర అస్వస్థతకు లోనై గుండెపోటుకు గురికాగా.. అదే బస్సులో ప్రయాణిస్తున్న మాధవరం పల్లె దవాఖాన డాక్టర్ నందిని గమనించి సీపీఆర్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం అతడిని 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన డాక్టర్ను తోటి ప్రయాణికులు అభినందించారు. సహకరించిన బస్సు డ్రైవర్, కండెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన వైద్యురాలు