మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లాస్థాయి అండర్–14 విభాగం బాలబాలికల వాలీబాల్ టోర్నీతో పాటు ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. ఇందులో ఉమ్మడి జిల్లాలోని మండలాల నుంచి దాదాపు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. టోర్నీలో బాలుర విభాగంలో నవాబ్పేట, రాజాపూర్, బాలికల విభాగంలో బాలానగర్, కోయలకొండ జట్లు విజేతలుగా నిలిచాయి. బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి చెన్న వీరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో క్రమశిక్షణతో ఉన్నతస్థాయికి ఎదుగుతారని అన్నారు. ఓడిన వారు నిరాశచెందకుండా మళ్లీ గెలుపు కోసం శ్రమించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి రమేశ్బాబు, సహాయ కార్యదర్శి వేణుగోపాల్, పరశురాం, గజానంద్, అయూబ్, ఆంజనేయులు, ఉమాపతిరెడ్డి, సుచేతన్, జగన్మోహన్గౌడ్, నిరంజన్రావు, అబ్దుల్లా, గీత, రాములు, రవినాయక్ పాల్గొన్నారు.
విజేతలుగా బాలానగర్,
నవాబ్పేట జట్లు