హజ్‌యాత్ర దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం | Sakshi
Sakshi News home page

హజ్‌యాత్ర దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

Published Fri, Dec 8 2023 1:06 AM

దరఖాస్తులు స్వీకరిస్తున్న  సొసైటీ ప్రతినిధులు    - Sakshi

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: వచ్చే ఏడాది వెళ్లే హజ్‌ యాత్రికుల దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభమైనట్లు జిల్లా హజ్‌ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు మహమూద్‌ అలీ, ఎండీ మేరాజుద్దీన్‌ తెలిపారు. గురువారం జిల్లాకేంద్రం మోటార్‌లైన్‌ వక్ఫ్‌ కాంప్లెక్స్‌ కార్యాలయంలోని హజ్‌ సొసైటీ కార్యాలయంలో హజ్‌యాత్రకు సంబంధించి పలువురి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 20వ తేదీ వరకు హజ్‌యాత్రకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. హజ్‌ యాత్రకు వెళ్లేవారు తమ సొసైటీ కార్యాలయంలో ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.మిగతా వివరాల కోసం హజ్‌ సొసైటీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సంప్రదించాలని కోరారు. సొసైటీ చీఫ్‌ ప్యాట్రన్‌ రవూఫ్‌పాష, సత్తార్‌, అహ్మద్‌ పటేల్‌, ఎండీ రఫీక్‌, అయూబ్‌పాష, రఫీక్‌ ఉర్‌ రహెమాన్‌ పాల్గొన్నారు.

వక్ఫ్‌ కాంప్లెక్స్‌ కమిటీ అధ్యక్షుడి రాజీనామా

జిల్లా కేంద్రంలోని వక్ఫ్‌ కాంప్లెక్స్‌ మేనేజింగ్‌ కమిటీ అధ్యక్ష పదవికి మహమూద్‌అలీ గురువారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వక్ఫ్‌ కాంప్లెక్స్‌ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌ ఆడిటర్‌ రియాజ్‌కు రాజీనామా లేఖను అందజేశారు. వ్యక్తిగత కారణాలతో వక్ఫ్‌ కాంప్లెక్స్‌ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు మహమూద్‌అలీ తెలిపారు.

Advertisement
Advertisement