నడిగడ్డలో పదవులకు పోటీ.. | Sakshi
Sakshi News home page

నడిగడ్డలో పదవులకు పోటీ..

Published Sun, Dec 17 2023 10:16 AM

-

మ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు 12 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించగా, నడిగడ్డగా పేరొందిన గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాల్లో మాత్రం బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందారు. అయితే ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ పదవులను ఆశిస్తున్న కాంగ్రెస్‌ ఆశావహుల జాబితా ఎక్కువగా కన్పిస్తోంది. అలంపూర్‌లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, మాజీ ఎంపీ మందా జగన్నాథం, తాజా మాజీ ఎమ్మెల్యే అబ్రహం ఎమ్మెల్సీ పదవులతో పాటు కేబినెట్‌ స్థాయి హోదా పదవిని ఆశిస్తున్నారు. గద్వాలలో జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఉమ్మడి జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ బండారి భాస్కర్‌, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, మధుసుదన్‌బాబు ఎమ్మెల్సీ లేదా ప్రభుత్వంలో సముచిత స్థానాలు దక్కుతాయని ఆశలు పెట్టుకున్నారు. వీరితో పాటు జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, ఆలయాల చైర్మన్లు తదితర నామినేటెడ్‌ పోస్టులకు సైతం తీవ్రమైన పోటీ నెలకొంది.

Advertisement
Advertisement