ఎన్మన్‌బెట్లలో చేపల పంచాయితీ | Sakshi
Sakshi News home page

ఎన్మన్‌బెట్లలో చేపల పంచాయితీ

Published Thu, Dec 21 2023 1:06 AM

ఎన్మన్‌బెట్ల నల్లచెరువులో ఇరువర్గాలను శాంతింపజేస్తున్న పోలీసులు  - Sakshi

కొల్లాపూర్‌ రూరల్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలంలోని ఎన్మన్‌బెట్ల నల్లచెరువులో చేపలు పట్టే విషయంపై నెలకొన్న పంచాయితీ తారస్థాయికి చేరింది. చెరువు తమదంటే తమదని పేర్కొంటూ గ్రామంలోని మత్స్యకారులు, దళితులు ఘర్షణకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లచెరువులో చేపలు తామే పట్టాలని.. ఈ చెరువుపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని ఇరువర్గాలు పేర్కొంటూ బుధవారం చెరువు వద్ద వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాల వారిని శాంతింపజేశారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ కొన్నేళ్లుగా నల్లచెరువులో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువుపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయన్నారు. అదేవిధంగా దళితులు మాట్లాడుతూ చెరువులో తమ భూములు మునకకు గురయ్యాయని, చెరువులో చేపలు పట్టే హక్కు తమకే ఉందని తెలిపారు. కాగా ఇరువర్గాలు ఒకరిపై ఒకరు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

దళితులు, మత్స్యకారుల మధ్య ఘర్షణ

పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాల ఫిర్యాదు

Advertisement
Advertisement