మహబూబ్‌నగర్‌ క్రీడలు | Sakshi
Sakshi News home page

మహబూబ్‌నగర్‌ క్రీడలు

Published Fri, Dec 22 2023 1:18 AM

రన్నరప్‌గా నిలిచిన అండర్‌–17 జట్టు   - Sakshi

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురువారం ముగిసిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ 67వ రాష్ట్రస్థాయి నెట్‌బాల్‌ పోటీల్లో ఉమ్మడి జిల్లా బాలుర జట్లు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాయి. అండర్‌–14 విభాగం రాష్ట్రస్థాయి పోటీల్లో బాలుర జట్టు చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో బాలుర జట్టు 14–3 పాయింట్ల తేడాతో ఖమ్మంపై విజయం సాధించింది. అండర్‌–17 విభాగంలో ఉమ్మడి జిల్లా బాలుర జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఇరు జట్లను ఎస్‌జీఎఫ్‌ కార్యనిర్వాహక కార్యదర్శి రమేశ్‌బాబు, సహాయ కార్యదర్శి వేణుగోపాల్‌ అభినందించారు. భవిష్యత్‌లు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

– మహబూబ్‌నగర్‌ క్రీడలు

Advertisement
Advertisement