తాడిపర్తిలో గంజాయి పట్టివేత | Sakshi
Sakshi News home page

తాడిపర్తిలో గంజాయి పట్టివేత

Published Mon, Jan 1 2024 12:58 AM

పంచనామా నిర్వహిస్తున్న పోలీసులు   - Sakshi

గోపాల్‌పేట: ముగ్గురు యువకులు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పోలీసులు ఆదివారం మధ్యాహ్నం పట్టుకున్నారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా.. వనపర్తికి చెందిన ముగ్గురు యువకులు హైదరాబాద్‌లోని దూల్‌పేట నుంచి డ్రై గంజాయిని బస్సులో తీసుకెళ్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే తాడిపర్తి బస్టాండ్‌ సమీపంలో బస్సును నిలిపి తనిఖీ చేయగా ముగ్గురు యువకుల వద్ద 14 ప్యాకెట్లలో 190 గ్రాముల డ్రై గంజాయి దొరికింది. సాయంత్రం గోపాల్‌పేట ఎంపీడీఓ ఉసేనప్ప సమక్షంలో పంచనామా నిర్వహించి యువకులు సోను, భాను, అరుణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement