మహబూబ్నగర్ క్రైం: జోగుళాంబ జోన్–7 డీఐజీగా 2010 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ జోయల్ డేవిస్ను నియమించారు. ప్రస్తుత డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ను రామగుండం కమిషనర్గా బదిలీ చేశారు. గతేడాది నూతనంగా ఏర్పాటైన జోగుళాంబ జోన్–7 డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్ 2023 జనవరి 8న డీఐజీగా బాధ్యతలు తీసుకున్నారు. జోన్ ఏర్పాటు తర్వాత మొదటి డీఐజీగా వచ్చిన ఆయన జిల్లాలో ఏడాదిపాటు పనిచేశారు. ప్రస్తుతం డీఐజీగా నియామకమైన జోయల్ డేవిస్ హైదరాబాద్ సిటీలోని ఎస్బీ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నారు. డీఐజీ జోయల్ డేవిస్ స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని కొట్టికోడు గ్రామం. 2010లో ఐపీఎస్గా ఎంపికై న తర్వాత మొదటి పోస్టింగ్ జనగాం ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత ఉట్నూర్, ఆదిలాబాద్ ఏఎస్పీగా, హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేయడం జరిగింది.