వివాహం కావడంలేదని ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

వివాహం కావడంలేదని ఆత్మహత్యాయత్నం

Published Wed, Jun 28 2023 12:48 AM

సంతోష్‌ (ఫైల్‌) - Sakshi

జైపూర్‌(చెన్నూర్‌): వివాహం కావడంలేదని మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన రౌతు మొండక్క–పాపయ్య దంపతుల కుమారుడు రౌతు సంతోష్‌ (27) సింగాపూర్‌ ఓపెన్‌కాస్టులో డైవర్‌గా పనిచేస్తున్నాడు. వివాహం కావడంలేదని మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం నర్సింగాపూర్‌ సమీపంలోని కుందారం వైపు వెళ్లే దారిలో పురుగుల మందుతాగి అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ముందుగా మంచిర్యాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఉపేందర్‌రావు తెలిపారు.

సంతోష్‌ నేత్రాలతో ఇద్దరికి చూపు..
కాగా సంతోష్‌ నేత్రాలను హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి దానం చేసి మృతుని కుటుంబ సభ్యులు మానవత్వం చాటుకున్నారు. అతని మృతి చెందినా మరో ఇద్దరికి చూపునిచ్చాడని మృతుని కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు.

Advertisement
Advertisement