క్లుప్తంగా | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Mon, Sep 4 2023 12:26 AM

-

హత్యకేసులో ఇద్దరి అరెస్ట్‌

చెన్నూర్‌:పట్టణంలోని కొత్తగూడెం కాలనీలో మడక తిరుపతి (35)ని హత్యచేసిన భార్య సౌందర్య, అత్త లక్ష్మిని ఆదివారం అరెస్టు చేసినట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామన్నారు.

కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య

నెన్నెల: కడుపు నొప్పి భరించలేక మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై శ్యాంపటేల్‌ కథనం ప్రకారం.. మండలంలోని కుశ్నపల్లికి చెందిన బద్ది సుక్కక్క(55) మూడేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. చికిత్స తీసుకున్నా, నెల రోజులుగా మందులు వాడుతున్నా ఎంతకీ కడుపునొప్పి తగ్గలేదు. ఆదివారం ఉదయం భర్త పశువులు మేపడానికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమెకు తీవ్ర కడుపునొప్పి రావడంతో భరించలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. భర్త హన్మంతు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు.

పురుగుల మందు తాగి ఒకరు

రెబ్బెన(ఆసిఫాబాద్‌): పురుగుల మందు తాగి రిటైర్డ్‌ సింగరేణి కార్మికు డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై లక్ష్మణ్‌ కథనం ప్రకారం.. మండలంలోని గోలేటి విలేజ్‌కు చెందిన బానోత్‌ రూప్లా (65) గత కొంతకాలంగా కడుపునొప్పి, ఊపిరితిత్తుల సమస్య తో బాధపడుతున్నాడు. ఆసుపత్రులకు వెళ్లినా ఆరోగ్యం కుదుటపడలేదు. జీవితంపై విరక్తితో శనివారం రాత్రి ఇంట్లో గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన పెద్దకుమారుడు రవినాయక్‌ రెబ్బె న పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుమారుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement