గోదావరి బ్రిడ్జిపై నిమజ్జనం ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

గోదావరి బ్రిడ్జిపై నిమజ్జనం ఏర్పాట్లు

Published Thu, Sep 21 2023 1:36 AM

ఏర్పాట్లను పరిశీలిస్తున్న పెద్దపల్లి కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, సీపీ రెమా రాజేశ్వరి - Sakshi

జైపూర్‌: మంచిర్యాల–పెద్దపల్లి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన గోదావరి నది బ్రిడ్జిపై వినాయక నిమజ్జన ఏర్పాట్లను పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల అధికార యంత్రాంగం బుధవారం పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, రామగుండం పోలీసు కమిషనర్‌ రేమా రాజేశ్వరి, మంచిర్యాల డీసీపీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ సందర్శించారు. మంచిర్యాల జిల్లాతోపాటు పెద్దపల్లి జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన నిర్వాహకులు పెద్ద ఎత్తున్న ఇక్కడ గోదావరిబ్రిడ్జిపై నుంచి ప్రతి ఏటా వినాయకుల నిమజ్జనం చేస్తారు. ఇందులో భాగంగా అధికారులు చేపడుతున్న ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. సింగరేణి రెస్క్యూ బృందాలు, మున్సిపల్‌, రెవెన్యూ, పోలీస్‌శాఖ సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement