నిర్మల్‌ నుంచి ‘పొద్దుటూరి, ‘సముద్రాల’.. | Sakshi
Sakshi News home page

నిర్మల్‌ నుంచి ‘పొద్దుటూరి, ‘సముద్రాల’..

Published Sat, Oct 14 2023 11:56 PM

పొద్దుటూరి నర్సారెడ్డి - Sakshi

నిర్మల్‌ నియోజకవర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు హ్యాట్రిక్‌ సాధించారు. 1962, 1967లలో నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన పొద్దుటూరి నర్సారెడ్డి విజయం సాధించారు. మూడోసారి 1972 లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి హ్యాట్రిక్‌ విజేతగా నిలిచారు. రెవెన్యూశాఖ మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించా రు. 1985, 1989, 1994లలో నిర్వహించిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన సముద్రాల వేణుగోపాలచారి వరుసగా విజయం సాధించారు. 1996, 1998, 1999లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ విజయం సాధించి డబుల్‌ హ్యాట్రిక్‌ నేతగా పేరుగాంచారు. రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రిగా, కేంద్ర విద్యుత్‌ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు.

వేణుగోపాలచారి
1/1

వేణుగోపాలచారి

Advertisement
Advertisement