శివకుమార్‌కు డాక్టరేట్‌ ప్రదానం | Sakshi
Sakshi News home page

శివకుమార్‌కు డాక్టరేట్‌ ప్రదానం

Published Sat, Nov 11 2023 12:42 AM

గవర్నర్‌ చేతుల మీదుగా పట్టా తీసుకుంటున్న శివకుమార్‌ - Sakshi

మంచిర్యాలఅర్బన్‌: జిల్లా కేంద్రానికి చెందిన సందబోయిన శివకుమార్‌ గవర్నర్‌ తమిళసై చేతుల మీ దుగా డాక్టరేట్‌ పట్టా అందుకున్నారు. మహాత్మాగా ంధీ యూనివర్సిటీలో ‘కస్టమర్‌ సాటిస్పాక్షన్‌ టు వ ర్డ్స్‌ గ్రీన్‌ బ్యాంకింగ్‌ ప్రాక్టీస్‌ విత్‌ స్పెషల్‌ రిఫరెన్స్‌ టు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అనే అంశంపై చేసి న పరిశోధనకు యూనివర్సిటీ మూడో స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ ప్రదానం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన శివకుమార్‌ స్థానిక శ్రీహర్ష జూని యర్‌ కళాశాలలో సీఈసీ, శ్రీహర్ష డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌ పూర్తి చేసి మంచి ర్యాంకులు పొందారు. కరీంనగర్‌ శాతవాహన యూనివర్సిటీలో ఎంకాం చదివి మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. ఈ సందర్భంగా శివకుమార్‌ను శుక్రవారం కళాశాలలో కరస్పాండెంట్‌ పల్లె భూమేశ్‌, అధ్యాపకులు అభినందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement