రౌడీషీటర్‌ దారుణ హత్య | Sakshi
Sakshi News home page

రౌడీషీటర్‌ దారుణ హత్య

Published Sat, Nov 11 2023 12:42 AM

సంతోష్‌రెడ్డి (ఫైల్‌) - Sakshi

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ పట్టణానికి చెందిన రౌడీషీటర్‌ చందుపట్ల సంతోష్‌రెడ్డి (38) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పట్టణంలోని రైల్వేస్టేషన్‌ ఏరియాలోగల తైబానగర్‌ కాలనీలో భారత్‌ హోటల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన సంతోష్‌రెడ్డి స్థానిక భారత్‌ హోటల్‌ యజమానితోపాటు, పలువురిని డబ్బుల కోసం రెండురోజులుగా వేధింపులకు గురి చేశాడు. ఈ క్రమంలో సంతోష్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం హోటల్‌కు రాగా, అక్కడే ఉన్న గుర్తుతెలియని వ్యక్తులు పథకం ప్రకారం ముందుగా కత్తితో దాడి చేశారు. ఆపై గొంతు కోశారు. తీవ్రగాయాలైన సంతోష్‌రెడ్డి ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. కాగా, సంతోష్‌రెడ్డిపై మూడు హత్య కేసులు, మరో 13 బెదిరింపులు, పలు దొంగతనాల కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ కేసులో ఇటీవలే బెయిల్‌పై వచ్చిన రౌడీషీటర్‌ సంతోష్‌రెడ్డిని కాగజ్‌నగర్‌లో ఉండరాదంటూ శుక్రవారం ఉదయమే ప్యాసింజర్‌ రైలు ఎక్కించారు. ఆయన ఆసిఫాబాద్‌ రోడ్డు రైల్వేస్టేషన్‌లో దిగి, మళ్లీ కాగజ్‌నగర్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య ఉండగా, ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తెలిసింది. కాగా, ఘటనా స్థలాన్ని ఎస్పీ సురేశ్‌కుమార్‌ సందర్శించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ ఎస్‌హెచ్‌వో బీ స్వామి తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement