జూనియర్‌ న్యాయవాదులకు శిక్షణ | Sakshi
Sakshi News home page

జూనియర్‌ న్యాయవాదులకు శిక్షణ

Published Sun, Nov 19 2023 1:30 AM

శిక్షణలో మాట్లాడుతున్న జూనియర్‌ సివిల్‌ జడ్జి - Sakshi

లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని మున్సిఫ్‌ మెజి స్ట్రేట్‌ కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్జి మహ్మద్‌ అసదుల్లా షరీఫ్‌ జూనియర్‌ న్యాయవాదులకు శిక్షణ ఇచ్చారు. శనివారం మండల కేంద్రంలోని కోర్టు ఆవరణలో కోర్టు స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా జూనియర్‌ న్యాయవాదులకు ఆయన శిక్షణ ఇచ్చారు. నాలుగు నెలలపాటు ప్రతీ శనివారం ఉత్సవాల్లో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. చట్టాలపై అవగాహన, కేసుల్లో మెలకువలు, న్యాయవాద వృత్తి విధానాలు, పద్ధతులు, కొన్ని కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లు వివరించారు. శతాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. అనంతరం సీనియర్‌ న్యాయవాదులు రాజేశ్వర్‌రావు, అక్కల శ్రీధర్‌ పలు చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సురేందర్‌, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement