రోడ్డు ప్రమాదంలో కార్మికుడు మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కార్మికుడు మృతి

Published Mon, Apr 8 2024 1:10 AM

వెంకటేశ్వర్లు 
మృతదేహం
 - Sakshi

మందమర్రిరూరల్‌(చెన్నూర్‌): పట్టణంలోని ఫస్ట్‌ జోన్‌ మార్కెట్‌ ఏరి యాకు చెందిన సింగరే ణి కార్మికుడు పాయం వెంకటేశ్వర్లు (53) శని వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్కే ఓసీపీలో ఫిట్టర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై పాత బస్టాండ్‌ వరకు వెళ్లి వస్తుండగా రామన్‌కాలనీ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి వద్ద బైక్‌ అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆర్కేపీ సింగరేణి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement