అక్రమ మైనింగ్‌లకు అడ్డుకట్ట వేయండి | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌లకు అడ్డుకట్ట వేయండి

Published Fri, Mar 17 2023 6:04 AM

మైనింగ్‌ ఏడీకి ఫిర్యాదు చేస్తున్న 
బాలకృష్ణారెడ్డి, తదితరులు 
 - Sakshi

తూప్రాన్‌: మండలంలో అక్రమ మైనింగ్‌లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు బాలకృష్ణారెడ్డి మెదక్‌ మైనింగ్‌ ఏడీ దేవరాజుకు ఫిర్యాదు చేశారు. మైనింగ్‌ నుంచి ఎలాంటి అనుమతి పొందకుండా అక్రమంగా బోరు బ్లాస్టింగులకు పాల్పడుతున్న వివిధ క్వారీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. వీరి ఆగడాలతో వ్యవసాయ బోరు బావులు పూడుకుపోతున్నాయని, ఇళ్లు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్‌ పొగతో కాలుష్యంతో పాటు పంటలకు నష్టం వాటిల్లుతుందని వివరించారు. ఆయన వెంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు చంద్రశేఖర్‌, నందు ఉన్నారు.

Advertisement
Advertisement