నేటి నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్లీనరీ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్లీనరీ

Published Fri, Sep 8 2023 6:16 AM

- - Sakshi

మెదక్‌: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి రమేశ్‌ గురువారం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం విద్యార్థి ర్యాలీతో పాటు బహిరంగ సభ ఉంటుందని, ఈ సభకు ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను హాజరవుతున్నారన్నారు. అలాగే 33 జిల్లాల నుంచి 350 మంది ప్రతినిధులు కూడా వస్తున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.

Advertisement
Advertisement