సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే ప్రచారానికి రావద్దు | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే ప్రచారానికి రావద్దు

Published Wed, Nov 1 2023 4:28 AM

సమావేశంలో మాట్లాడుతున్న విజయ్‌ కుమార్‌  - Sakshi

నిజాంపేట(మెదక్‌): సమస్యలు పరిష్కరించలేని ఎమ్మేల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి గ్రామాల్లో ప్రచారం ఎలా చేస్తారని జెడ్పీటీసీ పంజా విజయ్‌ కుమార్‌ ధ్వజమెత్తారు. నిజాంపేటలోని జెడ్పీటీసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల పరిధిలోని నస్కల్‌ గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన ఒక మహిళ తమ సమస్యలు తెలుపుదామని వస్తే బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆమెను తోసివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే గ్రామాల్లో తిరగడం ఎందుకని ఆయన ఎద్దేవా చేశారు. ఇల్లు కోల్పోయి అన్యాయానికి గురైన ఆ మహిళ కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే మెదక్‌ ఎంపీ కొత్త ప్రబాకర్‌రెడ్డిపై జరిగిన దాడులను బీజేపీ ఖండిస్తుందన్నారు. నార్లాపూర్‌ గ్రామంలో కాళ్లేశ్వరం కాలువ పనులల్లో భూములు కోల్పోయిన బాధితులకు మంత్రి హరీశ్‌రావు డబుల్‌బెడ్రూంలు కేటాయిస్తామని ఇచ్చిన హామీ ఏమైందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌, అధికార ప్రతినిధి శ్రీనివాస్‌, తీగల శ్రీనివాస్‌ గౌడ్‌, స్వామి గౌడ్‌, పోలు శ్రీనివాస్‌, జాల పోచయ్య, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్‌ కుమార్‌

Advertisement
Advertisement