మూడోసారి కేసీఆర్‌నే సీఎం చేయాలి | Sakshi
Sakshi News home page

మూడోసారి కేసీఆర్‌నే సీఎం చేయాలి

Published Thu, Nov 23 2023 4:38 AM

మాట్లాడుతున్న గంగాధరరావు  - Sakshi

చిన్నశంకరంపేట(మెదక్‌): మూడోసారి కూడా కేసీఆర్‌ను సీఎం చేసేందుకు ప్రజలు బీఆర్‌ఎస్‌నే గెలిపించాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఏకే గంగాధరరావు కోరారు. బుధవారం చిన్నశంకరంపేటతో పాటు ధరిపల్లి, గవ్వలపల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ను నమ్మవొద్దని, గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని అందుకే మెదక్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్‌తోనే రైతులకు కూడా మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్‌.అంజిరెడ్డి, లక్ష్మారెడ్డి, రాధాకిషన్‌రావు, రమేశ్‌రావు, పూర్ణ్ణచందరరావు, మున్యానాయక్‌, వెంకటేశం పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గంగాధరరావు

Advertisement
Advertisement