మెదక్‌ వాసి అబ్దుల్‌ ఖదీర్‌కు డాక్టరేట్‌ | Sakshi
Sakshi News home page

మెదక్‌ వాసి అబ్దుల్‌ ఖదీర్‌కు డాక్టరేట్‌

Published Thu, Nov 30 2023 4:44 AM

డాక్టరేట్‌ పొందిన అబ్దుల్‌ ఖదీర్‌ - Sakshi

మెదక్‌ మున్సిపాలిటీ: మెదక్‌ పట్టణ వాసి అబ్దుల్‌ ఖదీర్‌కు డాక్టరేట్‌ లభించింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఎల్లంకి ఇంజనీరింగ్‌ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఖదీర్‌ చేసిన ఒక పరిశోధనకు గాను ఆయనకు డాక్టరేట్‌ వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లా షికోహబాద్‌లోని జేఎస్‌ యూనివర్సిటీ ఈ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎల్లంకి ఇంజనీరింగ్‌ విద్యా సంస్థల చైర్మన్‌ సదాశివరెడ్డి, డైరెక్టర్‌ సాంబశివ రెడ్డి, సెక్రటరీ దయాకర్‌ రెడ్డి, అకడమిక్‌ డైరెక్టర్‌ సాయి కిరణ్‌, ప్రిన్సిపాల్‌ జాన్‌పాల్‌ అభినందించారు. గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ డాక్టరేట్‌ పొందడం తమకు ఎంతో గర్వకారణమని విద్యా సంస్థల చైర్మన్‌ సదాశివరెడ్డి ప్రశంసించారు.

Advertisement
Advertisement